పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : హేమంతఋతు వర్ణనము

  •  
  •  
  •  

10.1-805-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంభుకంట నొకటి లరాశి నొక్కటి
ఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు
లికి నులికి భక్తి లుపకున్నె?

టీకా:

శంభు = శివుని; కంటన్ = కంటియందు; ఒకటి = ఒకటి; జలరాశిన్ = సముద్రమునందు; ఒక్కటి = ఒకటి; మఱియున్ = ఇంకను; ఒకటి = ఒకటి; మనుజ = మానవుల; మందిరములన్ = నివాసములందు; ఒదిగెన్ = దాగెను; కాకన్ = లేకపోయినచో; మెఱసి = బహిరంగముగామెలగుచు; ఉన్నన్ = ఉండినచో; మూడగ్నులు = త్రేతాగ్నులు మూడు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2ఆహవనీయము 3దక్షిణాగ్నులు అనెడి మూడు అగ్నులు}; చలి = చలి; కిన్ = కి; ఉలికి = అదిరిబెదిరి; భక్తి = సేవ; సలుపక = చేయకుండగా; ఉన్నె = ఉండునా.

భావము:

చలిదెబ్బకు తట్టకోలేక త్రేతాగ్నులు మూడు అగ్నులలోను ఆహవనీయం అనే అగ్ని ఒకటి శివుని మూడోవ నేత్రంలో అణగి ఉంది. దక్షిణాగ్ని అనే మరొకటి సాగర గర్భంలో చొచ్చింది. గార్హపత్యం అనే అగ్ని ఇంకొకటి గృహస్థుల ఇండ్లలో ఒదిగి ఉంది. అలాకాక బట్టబయల ఉంటే హేమంతఋతు చలికి త్రేతాగ్నులు కొంకర్లు తిరిగి పోయేవి.