పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట

  •  
  •  
  •  

10.1-144-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర
కాశోద్ధత తుంగ భంగ లిత ధరాశా
కా యగు యమున మును సీ
తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.

టీకా:

ఆ = ఆ; శౌరి = వసుదేవుని {శౌరి - శూరిని పుత్రుడు, వసుదేవుడు}; కిన్ = కి; తెరువు = దారి; ఒసంగెన్ = ఇచ్చెను; ప్రకాశ = బాగుగా కనబడుతు; ఉద్ధతన్ = అతిశయించిన; తుంగ = పొడవైన; భంగ = అలలు; కలిత = కలిగిన; ధర = భూమి; ఆశ = దిక్కులు; ఆకాశ = ఆకాశము కలది; అగు = ఐన; యమున = యమునానది; మును = ఇంతకు పూర్వము; సీతేశున్ = శ్రీరాముని {సీతేశుడు - సీతాదేవి యొక్క భర్త, రాముడు}; కున్ = కు; పయోధి = సముద్రము {పయోధి - పయస్ (నీటి)కి నిధి, కడలి}; త్రోవ = దారి; ఇచ్చిన = ఇచ్చిన; భంగిన్ = విధముగా.

భావము:

శూరుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రవహిస్తూ ఉన్న, ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, ఆ శిశు రూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.