పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసు డక్రూరునితో మాట్లాడుట

  •  
  •  
  •  

10.1-1163-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామకేశవు లంతరించిన వసు-
దేవ ముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్ణి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి-
ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
గు నుగ్రసేను మా య్య గీటడగించి-
పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
ఱియు వైరులనెల్ల ర్దించి నే జరా-
సంధ నరక బాణ శంబరాది

10.1-1163.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖులతోడ భూమిక్ర మేలెదఁ బొమ్ము
తెమ్ము వేగమ వసుదేవసుతుల
ఖము పేరు చెప్పి మంత్రభేదము చేయ
లయుఁ బెంపఁ జనదు వైరి జనుల."

టీకా:

ఆ = ఆ యొక్క; రామ = బలరాముడు; కేశవులు = కృష్ణులు; అంతరించినన్ = నశించగా; వసుదేవ = వసుదేవుడు; ముఖ్యులన్ = మొదలగువారిని; చంపి = సంహరించి; తెగువన్ = సాహసము; మెఱసి = కనబరచి; వృష్ణి = వృష్ణివంశస్థుల; భోజ = భోజవంశస్థుల; దశార్హ = దశార్హవంశస్థుల; వీరులన్ = శూరులను; తెగటార్చి = సంహరించి; ముదుకడు = ముసలివాడు; రాజ్య = రాజ్యమునేలుట యందు; కాముకుడు = మిక్కిల ఆసక్తికలవాడు; ఖలుడు = దుర్జనుడు; అగు = ఐన; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; మా = మా యొక్క; అయ్యన్ = తండ్రిని; గీటడగించి = చంపేసి; పినతండ్రి = చిన్నాన్న; దేవకున్ = దేవకుని; పిలుకుమార్చి = చంపి; మఱియును = ఇంకను యుండిన; వైరులన్ = శత్రువులను; ఎల్లన్ = అందరిని; మర్దించి = అణగగొట్టి; నేన్ = నేను; జరాసంధ = జరాసంధుడు; నరక = నరకుడు; బాణ = బాణుడు; శంబర = శంబరుడు; ఆది = మొదలైన.
సఖుల = స్నేహితుల; తోడన్ = తోటి; భూమిచక్రమున్ = భూమండలమును; ఏలెదన్ = పాలించెదను; పొమ్ము = వెళ్ళు; తెమ్ము = తీసుకుని రమ్ము; వేగమ = తొందరగా; వసుదేవ = వసుదేవుని; సుతులన్ = కుమారులను; మఖము = యాగము; పేరుచెప్పి = వంకపెట్టి; మంత్రభేదము = నమ్మించి చెరచు ఆలోచన (పాలపర్తి నాగేశ్వర శాస్త్రి వారి శ్రీమదాంధ్ర భాగవతము); చేయవలయును = చేయవలెను; పెంపజనదు = వృద్ధిపొందింపరాదు; వైరి = శత్రువులైన; జనుల = వారిని.

భావము:

బలరాముడు కృష్ణుడు ఇద్దరు నేలకూలిన వెంటనే, వసుదేవుడు మున్నగు ప్రముఖులను సంహరిస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను హతమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడూ ముసలివాడూ దుర్మార్గుడూ అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పినతండ్రియైన దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్నిపరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో నీవు వెళ్ళి వసుదేవుడి కొడుకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకుని రా. పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయ రాదు.”