పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల తాదాన్యతోన్మత్తత

  •  
  •  
  •  

10.1-1021.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
సురవైరి ననుచు బల యొక్కతె చీరుఁ
సుల మనెడి సతుల రతముఖ్య!

టీకా:

పూతన = పూతన; ఐ = నేనై ఉన్నాననుచు; ఒక్క = ఒకానొక; పొలతి = స్త్రీ; చరింపంగన్ = వర్తించుచుండగా; శౌరి = కృష్ణుడను {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; ఐ = నేనై ఉన్నాననుచు; ఒక్క = ఒకానొక; కాంత = స్త్రీ; చన్నుగుడుచు = స్తన్యపానము చేయును; బాలుడు = బాలకృష్ణుడను; ఐ = నేనై ఉన్నాననుచు; ఒక = ఒకానొక; భామ = స్త్రీ; పాలు = పాలు; కున్ = కోసము; ఏడ్చుచున్ = రోదించుచుండగ; బండిన్ = బండిని; నేను = నేనై ఉన్నాను; అను = అనెడి; లేమన్ = స్త్రీని; పాఱదన్ను = పడదన్నును; సుడిగాలిని = నేను సుడిగాలిని; అని = అని; ఒక్క = ఒకానొక; సుందరి = స్త్రీ; కొనిపోవ = తీసుకుపోతుండగ; హరిన్ = నేను కృష్ణుడను; అని = అని; వర్తించు = నటించును; అబ్జముఖియు = స్త్రీ; బకుడన్ = బకాసురుని; నేను = నేనై ఉన్నాను; అని = అని; ఒక్క = ఒకానొక; పడతి = స్త్రీ; సంరంభింప = హడావిడిచేయగా; పద్మాక్షుడన్ = నేను కృష్ణుడను; అను = అనెడి; కొమ్మ = స్త్రీ; పరిభవించున్ = పరాభవించును; ఎలమి = పూని.
రామ = బలరాముడుగా; కృష్ణు = కృష్ణుడుగా; ఇంతులు = స్త్రీలు; ఇద్దరు = ఇద్దరు (2); కాగన్ = వలె నటించుచుండగ; గోప = గోపాలకులు; వత్స = దూడలు; గణము = సమూహము; కొందఱు = కొంతమంది; అగుదురు = ఐ వర్తించెదరు; అసురవైరిని = నేను కృష్ణుడను; అనుచు = అని; అబల = స్త్రీ; ఒక్కతె = ఒకానొక ఆమె; చీరున్ = పిలుచును; పసులము = మేము పశువులము; అనెడి = అనునట్టి; సతులన్ = స్త్రీలను; భరతముఖ్య = పరీక్షిన్మహారాజా {భరతముఖ్యుడు - భరత వంశము నందలి రాజులలో ముఖ్యుడు, పరీక్షిత్తు}.

భావము:

ఓ భరతవంశ ప్రముఖుడైన పరీక్షిన్మహారాజా! ఒక గోపిక పూతన వలె నటిస్తుంటే, కృష్ణునిలా అభినయిస్తున్న ఇంకొక గోపిక స్తన్యం తాగింది. మరొకామె పసిపిల్లాడిలా భావించుకొని పాలకేడుస్తూ, శకటాసురుడిని అని మెలగుతున్న ఇంకో గోపికను కాలితో తన్నింది. మరింకొకామె నేను కృష్ణుణ్ణి అంటు ఉన్నామెను తృణావర్తుడిలా ఎగరేసుకుపోయింది. ఇంకొకర్తె బకాసురుణ్ణి నేను అని విజృంభించగా, ఆమెను మరొకర్తె నేను వాసుదేవుణ్ణి అంటు పరాభవించింది. ఇంతలో ఇద్దరు ఇంతులు బలరామ కృష్ణులు కాగా, మరికొందరు మగువలు గోపకులు, దూడలు అయ్యారు. పసువులం మేం అంటున్న పడతులను పద్మాక్షుడను అనే ఆమె పిలిచింది.