పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రుల విచారంబు

  •  
  •  
  •  

10.1-872-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సర్వేశ్వరుండైన హరికి భిక్ష యిడి తమ భార్య లతని వలనం గృతార్థు లగుట యెఱింగి భూసురులు తమలో నిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సర్వేశ్వరుండు = సర్వులను నియమించువాడు; ఐనన్ = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; భిక్ష = భిక్ష; ఇడి = పెట్టి; తమ = వారి యొక్క; భార్యలు = సతులు; అతని = అతని; వలనన్ = వలన; కృతార్థులు = ధన్యులు; అగుట = అగుట; ఎఱింగి = తెలిసి; భూసురులు = విప్రులు; తమలోన్ = వారిలోవారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = చెప్పుకొనిరి.

భావము:

ఇలా తమ పత్నులు అఖిలాండేశ్వరుడైన కృష్ణునికి ఆహారం నివేదించి కృతార్థులు అయ్యారని తెలుసుకుని, ఆ బ్రాహ్మణ పుంగవులు తమలో ఇలా అనుకున్నారు. . .