పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-472-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“బాకులారా! ధాత్రీ
పాకు శపియింతు""ననుచుఁ లువడిని విలో
లాకుఁడగు మునికుంజర
బాకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్.

టీకా:

బాలకులారా = బాలకులారా; ధరిత్రీపాలకున్ = రాజును {ధరిత్రీపాలకుడు - భూమిని పాలించువాడు, రాజు}; శపియింతున = శపించెదను; అనుచున్ = అనుచు; పలు = మిక్కిలి; వడిని = వేగముతో; విలోల = చెదిరిన; అలకుఁడు = ముంగురులు కలవాడు; అగు = అయిన; మునికుంజరబాలకుఁడు = శృంగి {మునికుంజరబాలకుఁడు - మునులలో ఏనుగువంటి (శ్రేష్ఠుడైన) శమీకుని కుమారుడు, శృంగి}; అరిగెన్ = వెళ్ళెను; త్రి = మూడు (3); లోక = లోకముల; పాలకులు = పాలకులు - అధిపతులు; అదరన్ = ఉలికి పడునట్లు.

భావము:

“బాలకులాలా! వినండి. ఇప్పుడే ఆ భూపాలకునికి శాపం పెడతాను” అని మిక్కిలి వేగంగా చెదరిన ముంగురులతో నున్న మునిబాలకుడైన శృంగి ముల్లోకపాలకులు అదిరేటట్లు పెద్ద కేకలు వేస్తూ-