పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 68వ దశకము - భగవత్ సాక్షాత్కారము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
68-వ దశకము - భగవత్ సాక్షాత్కారము

68-1
తవ విలోకనాద్ గోపికాజనాః ప్రమదసంకులాః పంకజేక్షణ।
అమృతధారయా సంప్లుతా ఇవ స్తిమితతాం దధుస్త్వత్పురో గతాః॥
1వ భావము :-
పంకజాక్షా! నీవట్లు తిరిగి కనిపించగనే ఆ గోపవనితలు అత్యంత ఆనందభరితులయిరి. అమృతధారలలో మునిగితేలినట్లుగా వారు పులకించి నిశ్చేష్టులయిరి.

68-2
తదనుకాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణతీ నిర్విశంకితమ్।
ఘనపయోధరే సంనిధాయ సా పులకసంవృతా తస్థుషీ చిరమ్॥
2వ భావము :-
ప్రభూ! అప్పుడు ఒకగోపిక - పద్మమువంటి నీహస్తమును తనచేత పట్టుకొని నిస్సంకోచముగా తనవక్షస్థలమన నిలుపుకొనెను; పులకితురాలై చాలాసమయము అట్లేనిలిచిపోయెను.

68-3
తవ విభో।పరాకోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్।
గలసముద్ గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతీవాతిహర్షులా॥
3వ భావము :-
భగవాన్! మరియొక గోపవనిత - నీ సున్నిత హస్తమును తీసుకొని తనకంఠమునకు చుట్టుకొనెను. ఎట్లనగా - కుత్తుకనుండి తనప్రాణము ఎగిసిపోవుటను ఆపుటకా అనునట్లు నీ హస్తమును తనమెడచుట్టూ వేసి పట్టుకొనెను.

68-4
అపగతత్రపా కా౾పి కామినీ తవ ముకాంబుజాత్ పూగచర్వితమ్।
ప్రతిగృహయ్య తద్ వక్త్రపంకజే నిదధతీ గతా పూర్ణకామతామ్॥
4వ భావము :-
ప్రభూ! వేరొక గోపిక ఆతృతతో నీవు నమలుచున్న తాంబూలమును నీనుంచి తీసుకొని - ఏ సంశయములేక - తాను తినెను. అట్లుచేసి - తనకోరిక సిద్ధించినంత ఆనందమును పొందెను.

68-5
వికరుణో వనే సంవిహాయ మామపగతో౾సి త్వామిహ స్పృశేత్।
ఇతిసరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్॥
5వ భావము :-
భగవాన్! ఇంకొక గోపిక - నిన్నుచూడగానే - తన కన్నులలో నీరు నిండగా - నిన్ను రోషముతో చూచుచు - "దయలేనివాడా! నన్ను (నిర్దయగా) అడవిలో వదలి వెళ్ళితివి. మాలో ఇంక నిన్నెవరు తాకుదురు?" అని పలికెను.

68-6
ఇతి ముదాకులైర్వల్లవీజనైః సమముపాగతో యామునే తటే।
మృదుకుచాంబరైః కల్పితాసనే ఘుసృణభాసురే పర్యశోభథాః॥
6వ భావము :-
ప్రభూ! అప్పుడు ఆనందభరితమయిన హృదయములతో ఆ గోపికలు - కుంకుమ పుప్పొడులతో అలరారుచున్న తమ పైటకొంగులను ఆ యమునానదీతీరమున నీకైపరచిరి. నీవా ఆవస్త్రములపై ఆసీనుడవై- శోభిల్లితివి.

68-7
కతివిధా కృపా కే౾పి సర్వతో ధృతదయోదయాః కేచిదాశ్రితే।
కతిచిదీదృశా మాదృశేష్వపీత్యభిహితో భవాన్ వల్లవీజనైః॥
7వ భావము :-
భగవాన్! ఆ గోపికలు నీతో ఇట్లుసంభాషించిరి. "లోకములో కొందరు అందరిపట్ల సరిసమానమయిన దయ కలిగియుందురు. ఇంకొందరు తమను ఆశ్రయుంచిన వారిపట్లమాత్రమే దయకలిగియుందురు. కాని నీవంటివారు నీవే సర్వస్వమని నమ్మిననూ వారిపై జాలిలేక యుందురు"

68-8
అయి కుమారికా।నైవ శంక్యతాం కఠినతా మయి ప్రేమకాతరే।
మయి తు చేతసో వో౾నువృత్తయే కృతమిదం మయేత్యూచివాన్ భవాన్॥
8వ భావము :-
ప్రభూ! నీవప్పుడు ఆ గోపికలతో ఇట్లంటివి. " ఓ! ప్రియతమ గోపికలారా! మీకంటెను నాకు ప్రియమయినవారు -ఎక్కువయినవారు ఎవ్వరునులేరు. ఈ అందమయిన వెన్నెలరాత్రులలో నాతో విహరించండి", అని పలికితివి.

68-9
అయి నిశమ్యతాం జీవవల్లభాః।ప్రియతమో జనో నేదృశో మమ।
తదిహ రమ్యతాం రమ్యయామినీష్వనుపరోధమిత్యాలపో విభో।॥
9వ భావము :-
ప్రభూ! ఇంకనూ వారితో ఇట్లంటివి. "ప్రియగోపికలారా! నన్ను కఠినాత్ముడని తలచవలదు. నామాట వినండి. నేను అదృశ్యమగటతో నాయెడల మీ అనురాగము ఇంకనూ బలపడునని భావించి అట్లుచేసితిని. వేరొక విధముగా కాదు", అని పలికితివి.

68-10
ఇతి గిరాధికం మోదమేదురైర్ర్వజవధూజనైః సాకమారమన్।
కలితకౌతుకో రాసఖేలనే గురుపురీపతే।పాహిమాం గదాత్॥
10వ భావము :-
భగవాన్! ఈ విధముగా నీవు పలుకగనే - ఆ గోపస్త్రీలు అత్యంత ఆనందమును పొందిరి. ఆ గోపస్త్రీలతో విహరించుచూ, రాసక్రీడ నృత్యము చేయుచూ వారిని ఆనందంపజేసిన గురవాయూరు పురాధీశా! నా వ్యాధులనుండి నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
68వ దశకము సమాప్తము
-x-