ద్విపదభాగవతం - కల్యాణకాండ : నారదునిచే ననిరుద్ధుని యునికిఁ దెలిసి శ్రీకృష్ణుఁడు సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట
అక్కడ ననిరుద్ధు నాతోఁటలోన
నెక్కడ పోకయు నెఱుఁగంగలేక
బలభద్రమురహరిప్రద్యుమ్నముఖ్య
లలమి దిక్కులనెల్ల నందంద వెదకి
కానక యెంతయుఁ గళవళంబంది
మానసంబుల దుఃఖమగ్నులై యుండ; 880
కోరి కైలాటంబుఁ గూడుగా మెలఁగు
నూరివంద్యుఁడు బ్రహ్మసుతుఁడు నారదుఁడు
హరి సన్నధికి వచ్చి యనిరుద్ధువార్తఁ
గరతలామలకంబుగాఁ జెప్ప శౌరిఁ
విని వృష్టిభోజాంధవీరులతోడ
ఘనయోధరథవాజికరులతోడుతను
బలభద్రసాత్యకిప్రద్యుమ్నసాంబ
జలసత్యకృతవర్మసారణులాది
[“జలసత్య” అర్థము విచార్యము. వేరై యుండు నేమో?]
ద్వాదశాక్షోహిణీ దళసంఖ్యతోడ
యాదవరత్నంబు హరి దండువెడలె.
దళములు నడువంగ ధారుణి వడఁకె!
జలధులు కలఁగెనాశాచక్రమగలె!
హరియును నిట్లు నిత్యప్రయాణముల
నరుదెంచి రజతాద్రి యత్తీరభూమి
స్థాణునిచే రక్షితంబై వెలుంగు
శోణితపురము ముచ్చుటు విడియించి
యుపవనంబులు రాల్చియూళ్ళను గాల్చి
చపలత బహుజలాశయములఁ జెఱచి
పెరయీఁగ నందంద పేర్చిన పగిది
పురికోటలగ్గలద్భుతముగాఁ బట్టి 890
వీరును వారును వెసఁబోరఁజూచి
పౌరులందఱు భయభ్రాంతులై నిలువ