ద్విపదభాగవతం - కల్యాణకాండ : పౌండ్రకదంతవక్త్రాదులు కుండినపురి కేతెంచుట
అంతట శిశుపాలుఁడతి వైభవమున
దంతితురఁగసద్భటపదావళియును
వలనొప్ప పటహాదివాద్యముల్ మొరయ
బలియుఁడై చనుదెంచెఁ బరిణయంబునకు
హరితో విరోధాత్ములగు సాల్వమగధ
ధరణిఁ బౌండ్రకవరదంతవక్త్రులును 60.
గొమరార శిశుపాలుఁగూడి యేతేర
నప్పుడు భీష్మకుం డధిక వైభవము
లొప్పారఁ బురమున నుత్సవంబొదవ
కలుపడంబులు మేలుకట్లు తోరణము
లలవడ నేతెంచి యధికవైభవము
కలయఁ గుంకుమనీటఁ గలయావులలికి
మెలుపార కస్తూరి మేడలఁ బూసి
మొనసిన కప్పురమున మ్రుగ్గు వెట్టి
తనరారఁ గదలికాస్థంభంబు లెత్తి
(పు)రము సింగారించి పురహూతులీలఁ
(గరము) గొలిచిరి యా తరుణులు దాను
(వార) సన్నుతగీతవాద్యముల్ మొరయఁ
(జేరి) పేరంట్రాండ్రు సేసలుఁ జల్ల
(కురి) సంపదల నెదుర్కొని తోడితెచ్చి
(ధరణీ)శవరుల నందఱి మనోహరము
(లగు చో)టవిడియించి యఖిల సౌఖ్యములుఁ
(మిగుల) భక్తి నొనరించి దక లఁ బిలిచి
(గడి)యారమిడఁగ మంగళతూర్యనినద
(మెడ)పక మ్రోయంగ నెఱిఁగి రుక్మిణియు. 70