ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు భద్రనులక్షణను వివాహమాడుట
పూని కేకయరాజపుత్రిని భద్ర
మేనత్తకూఁతు నర్మిలిఁ బెండ్లియయ్యె.
మరి స్వయంవరమున మద్రేశతనయ
నరమి లక్షణఁ బెండ్లియయ్యె మురారి.
వఱలు రుక్మిణి జాంబవతి సత్యభామ
మెఱయు కాళిందియు మిత్రవిందయును
సత్యయు భద్రలక్షణయును ననఁగ
నత్యుదాత్తత భామలయ్యెనమండ్రు
పట్టపుదేవులై భాసిల్లుచుండ
నెట్టన నరకుని నిర్జించి శౌరి
వెలఁతుల పదియాఱువేలను దెచ్చి
యెలమి పెండ్లయ్యె నంచిట్లు సెప్పుటయు;
నరకుఁడెవ్వఁడు? వానినలినాక్షుఁడేలఁ
బరిమార్చె? నెక్కడి పడఁతులు వారు?
ఈ కథ నెఱిఁగింపుమని వేఁడుటయును
జేకొని శుకయోగి చెప్పంగఁ దొడఁగె. 550