ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు కుబ్జను మంచిరూపము నిచ్చి యనుగ్రహించుట
గనియెఁ గృష్ణుఁడు రహిగంధపుచిప్ప
వలచేతఁ బూని త్రివక్రయై నడచు
జలరుహాక్షుఁడు కుబ్జ చపలాక్షి నొరసి)
కని చల్లన నగుచు “కలకంఠి యెందుఁ
జనియెదు? గంధబాజన మెవ్వరికిని - 60
గొనిపోవుచున్నావు కొమరప్ప నీవు?”
అనవుఁడు హరిఁ జూచి యాకుబ్జ పలికె
“ వనపాక్ష! యేను సైరంధ్రిన్ త్రివిక్ర
యనుదాన. రాజు నన్నర్థి మన్నించు.
గందంబు వాసించి కలపంబుఁ గూర్చి
యందంబుగా మేన నలఁదఁ గానేర్తు
నిదె, దేవరకు యోగ్య మీగంధ, మలఁ ది
పదివేలుభూములు పాలింపు” మనుచు
మ్రొక్కి గంధపుచిప్ప ముందఱ నిడిన
నక్కజంబుగ శౌరి హలియునుఁ దాను
చందనం బలఁది యా చపలాక్షి మేని
చందంబుఁ జూచి యా చతురుఁడు దాని
కాలుకాలున మెట్టి కందువ1-7కీలఁ
గీలించినంత మైకిటుకును1-8 మాని
మెలఁతుక క్రొవ్వాఁడి మెఱుఁగ కోయనఁగఁ
గలికి కన్నుల సోయగము నివ్వెటిల్ల
మురిపంబు చిరునవ్వు మోమున మెఱయ,
హరిఁ జేరి సరసోక్తి నల్లనే పలికె.
“నాకాలుఁ ద్రొక్కితి నన్నుమన్నించి
నాకోర్కిఁ దీర్చుట నెయ్యంబు (న్యాయంబు) నీకు - 70
నా యింటి కేతెమ్ము నలినాక్ష!” అనుఁడు,
ఆయింతిఁ గనుఁగొని “యటఁబోయి మఱలి,
చనుదెంచెదము గాన చనియెద” మనుచు
వనిత వీడ్కొలిపి, యా వసుదేవసుతుఁ డు
చని వణిక్పథమున సకల (బేహార్లు)
అనుపమ దివ్య గంధాంబరాభరణ
ములు కానుకలు చేసి మ్రొక్కి దీవింప;
చెలువల మనములఁ జిత్తజానలము
1-7) కందువన్ = నేర్పున
1-8) కిటుకు = చిక్కు