ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : యుధిష్ఠిరుఁడు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట
నయ్యుధిష్ఠురుఁడు ధౌమ్యాదుల గూడి
చయ్యన నగ్రపూజలు చేయఁగోరి
యందఱ రాజుల నర్థి నీక్షించి
‘ఇందెవ్వరికి నర్ఘ్యమిత్తునో” యనఁగ
సహదేవుఁడన్నకు జలజాక్షుఁ జూపి
“విహితమాయర్ఘ్యంబు విష్ణున కిమ్ము
ద్విజుఁడును గురుఁడు ఋత్విజుఁడును భూమి
భుజుఁడు దైవంబునై పొలుపారు నతఁడు!
అతనిఁ బూజించిన నఖిల దేవతలు
పితరులు మునులు సంప్రీతిగావింతు”
రనవుండు ప్రియమంది యమతనూభవుఁడు
ఘనభక్తి హరికి నర్ఘ్యము సమర్పించె. - 630
బహురత్న భూషణాంబర గంధపుష్ప
విహితభంగుల మంత్ర విధిఁ బూజ సేయ
మునులు రాజులు మనంబుల సంతసిల్ల
ననిమిషావళి వచ్చి యభినుతి సేయ
నాలోన శిశుపాలుఁ డంతయుఁ జూచి
కాలాహిగతి మ్రోసి కరతలంబెత్తి
యొండొండ రోషాగ్ను లొలుకుచుండఁగను
పాండవాగ్రజు జూచి పలికె నుద్వృత్తి