ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట
రాజుల రక్షింప రాజసూయంబు
నోజముఁ దప్పక నొనరింపు” మనిన
హరి వాక్యములకుబ్బి యమతనూభవుఁడు
కురుపతి ముఖ్యులఁ గోరి రప్పించి
భాగీరథీతీర పావనస్థలిని
యాగశాలలు గట్టి యఖిల వస్తువులు
సమకూర్చి వ్యాసాది సంయమీశ్వరులఁ
గ్రమమొప్ప ఋత్విజగణము రావించి
యాగోపకరణంబు లన్నియుఁ దెచ్చి
యాగమోక్తక్రియ నన్ని సంధించి - 620
దక్షుల నియమించి ధర్మనందనుడు
దీక్షితుఁడై మహాద్విజకోటితోడ
వేలుచుచుండఁగ విష్ణుఁడంతటికిఁ
జాలి భూసురవర్యసమితితో నిలువ
తమ్ములు సకలబాంధవులును దారుఁ
గ్రమ్మర పరిచర్యఁ గావింపుచుండ
హవ్యభాగమునకు నఖిల దేవతలు
దివ్యయానములతో దివినుండి చూడ