ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో బ్రాహ్మణవేషములను ధరించి గిరివ్రజము ప్రవేశించుట
దనర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి - 530
యరులకభేద్యుఁడై యలరు మాగధుని
వర మందిరమున కవారణ నరిగి
దేవగురుద్విజ తృప్తిఁ గావించు
సావధానుని జరాసంధునిఁ గాంచి
వామనరూపమై వచ్చి యబ్బలిని
భూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగు
యనిలజార్జునులతో నర్థి దీవించి
చనవున నాజరాసంధుతో ననియె.