ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు సుదర్శనమును గృత్తిపై పనుచుట
తనుకొల్చియున్న సుదర్శన పురుషుఁ
గని నల్ల నవ్వుచు కనుసన్నఁ బనుప
నమ్మహాచక్రంబు హరి యాజ్ఞఁ బూని
క్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె - 200
శతయోజనోత్తాల చటుల విగ్రహము
శతభుజసమదోగ్రశస్త్రాస్త్రములును
ఘనసహస్రార్కనిర్గత తీవ్రరుచులఁ
బెనుమంటలెగయ నాభీలమై పేర్చి
హరి చక్రమేతెంచు టాలించి కృత్తి
మఱలె బిట్టొఱలుచు మది విహ్వలింప
పఱగంగ నయ్యెదు ప్రవరసాధనము
యఱిముఱి వెనుకొన నదికాశిఁ జొచ్చె.
చొచ్చిన నిట్టట్టు సురగంగ నీక
నచ్చక్ర మడరి ఘోరానలశిఖల
నాఋత్విజులతోడ నాకృత్తితోడ
నారాజుతోడ జనావళితోడ
ఘనశతాంగక వాజి గజశాలతోడ
ధనధాన్య వస్తు సంతానంబుతోడఁ
3-11 బొలుపారుసౌధగోపురములతోడఁ
గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి
యీశేషి హరి పాలికేతెంచి మ్రొక్కె.
నీకథావర్ణన మెల్ల వారలకు - 210
ప్రాకటకృత్యముల్ బాధలు నడఁగు
పుత్రసంపదలును భోగసంపదలు
శత్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు.”
అనిచెప్పుటయువిని యభిమన్యసుతుఁడు
వినతుఁడై శుకయోగివిభున కిట్లనియె.
“ఆ మందలో నుండి యరుదెంచి యచట
కామపాలుండేమిగతి విశ్రమించె?
ఆతని చరితంబు ననిశంబు వినఁగఁ
గౌతుకంబయ్యె నాకథఁ జెప్పు” మనిన
3-11 ఒకే పాదము కన్పట్టుచున్నది.