ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు రాజసూయయాగము నాచరింపవలసినదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట
“కౌరవవృషభ! లోకము రాజులకును
యేరీతి సిద్ధింప దీమహాక్రతువు
ధరణీశ! నీవు నీతమ్ములు బలిమి
దొరకని కార్య మెందును గలదయ్య?
పితృదేవ సద్విజప్రీతి గావింపు
టతిశయమగుపుణ్య మయ్యధ్వరంబు!
రాజులఁ గెలిచి వారల ధనావళుల
రాజసంబునఁ దెచ్చి రాజసూయంబు
వెలయింపవలయు దిగ్విజయంబు సేయఁ
దలఁచిన వేగ నీ తమ్ములఁ బంపు”
మని చెప్పుటయు విని యమనందనుండు
ననుజుల దిగ్విజయార్థంబు వనుపఁ