పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : ఉపేంద్రవజ్రము

9 ఉపేంద్రవజ్రము

పురారిము ఖ్యామర పూజనీయున్
సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్
దిరంబుగా నద్రి యతి న్నుతింపన్
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్.

గణ విభజన
IUI UUI IUI UU
గా
పురారి ముఖ్యామ రపూజ నీయున్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 11
ప్రతిపాదంలోని గణాలు: జ, త, జ, గా
యతి : ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా10.1407ఉపేం.
తపస్వి వాక్యంబులు దప్పవయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!