పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : తరళము

5 తరలము

జలరుహాహిత సోదరీ ముఖ చంద్ర చంద్రిక లాదటన్
గొలఁది మీఱఁగ లోచనంబుల గ్రోలి యొప్పు మహాసుఖిన్
బలుకుచో నభరంబులుం బిదప న్సజంబు జగంబులున్
జెలువుగా దరలంబు నోలి రచింతు రంధకజి ద్యతిన్.

గణ విభజన
III UII UIU IIU IUI IUI U
జలరు హాహిత సోదరీ ముఖచం ద్రచంద్రి కలాద టన్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 19
ప్రతిపాదంలోని గణాలు న, భ, ర, స, జ , జ, గ
యతి ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 23
ఉదాహరణ

భా10.1570త.
క్రతుశతంబులఁ బూర్ణకుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులు నై చనుఁ బాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!