పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : స్రగ్ధర

20 స్రగ్ధర

తెల్లంబై శైల విశ్రాంతిని మునియ
తినిం దేజరిల్లు న్ధృఢంబై
చెల్లెం బెల్లై మకారాంచిత రభన
యము ల్చెందమీద న్యకారం
బుల్లంబార న్బుధా రాధ్యు నురుగశ
యను న్యోగివంద్యుం గడు న్రం
జిల్లంజేయం గవీంద్రు ల్జితదనుజ
గురుం జెప్పెదర్ స్రగ్ధరాఖ్యన్.

గణ విభజన
UUU UIU UII III
తెల్లంబై శైలవి శ్రాంతిని మునియ
IUU IUU IUU
తినిందే జరిల్లు న్ధృఢంబై
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 21
ప్రతిపాదంలోని గణాలు: మ, ర, భ, న ,య, య, య
యతి : ప్రతిపాదంలోనూ 8వ, 15వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
వ్రాయుటకు, చదులుటకు వీలుకొరకు ప్రతి పాదము రెండుగా విడదీసితిమి.
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 3
ఉదాహరణ

భా10.2883స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గె
డయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలు న్దేరుల్‌ హతంబై వడిఁబడు సు
భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెము
కల న్గుంపులై సోలుచు న్బే
తాల క్రవ్యాద భూతోత్కరములు; జ
తలై తాళముల్‌ దట్టియాడున్.