పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : శార్దూల విక్రీడితము

4 శార్దూల విక్రీడితము

పద్మ ప్రోద్భవ సన్నిభు ల్మసజస ప్రవ్యక్త తాగంబులున్
బద్మాప్తాంచిత వశ్రమంబుగ సముత్పాదింతురు ద్యన్మతిన్
బద్మాక్షాయ నిజాంఘ్రి సంశ్రిత మహాపద్మాయ యోగీంద్రహృ
త్సద్మస్థాయ నమోస్తుతే యనుచు నీ శార్దూల విక్రీడితన్.

గణ విభజన
UUU IIU IUI IIU UUI UUI U
పద్మప్రో ద్భవస న్నిభుల్మ సజస ప్రవ్యక్త తాగంబు లున్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 20
ప్రతిపాదంలోని గణాలు మ, స, జ, స, త , త, గ
యతి ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 288
ఉదాహరణలు

భా8102శా.
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాల గ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచ ద్విలగ్నంబుతోన్.