పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : మత్తేభ విక్రీడితము

3 మత్తేభ విక్రీడితము

భవరోగ ప్రవినాశ నౌషధకలాప్రావీ ణ్యగణ్యుండు శై
లవిభేది ప్రము ఖాఖి లామర దరోల్లాసుండు గోవిందుఁ డం
చు వివేకు ల్సభరంబులున్నమయవస్తోమంబు గూడ న్స మ
ర్మ విధిం జెప్పుదు రా త్రయోదశ యతి న్మత్తేభ విక్రీడితిన్.

గణ విభజన
IIU UII UIU III UUU IUU IU
భవరో గప్రవి నాశనౌ షధక లాప్రావీ ణ్యగణ్యుం డుశై
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 20
ప్రతిపాదంలోని గణాలు స, భ, ర, న, మ , య, వ
యతి ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 586
ఉదాహరణలు

భా9260మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జిత హాటకం గపట భాషా విస్ఫుర న్నాటకన్
జవభిన్నార్యమ ఘోటకం గరవిరాజ త్ఖేటకం దాటకన్.
భా896మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ 'డభ్రగపతిం బన్నింపఁ' డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచల మైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.