పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : మానిని

15 మానిని

క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ
గూర్చిన కెంజడకొప్పునకున్
వన్నె యొనర్చిన వాహిని యీతని
వామపదంబున వ్రాలె ననన్
జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విల
సిల్లు రసత్రయ చిత్ర యతుల్
పన్నుగ నొందఁ బ్రభాసుర విశ్రమ
భంగిగ మానిని భవ్యమగున్.

గణ విభజన
UII UII UII UII
క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ
UII UII UII U
గూర్చిన కెంజడ కొప్పున కున్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 22
ప్రతిపాదంలోని గణాలు: భ, భ, భ, భ, భ భ, భ, గ
యతి : ప్రతిపాదంలోనూ 13వ, 19వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
మొత్తం గణాలు: 22 X 4; ప్రాస: ఉంది; ప్రాస యతి: కూడదు; యతి: 1, 13, 19; రకము: వృత్తము
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా10.1214మాని.
కాంచనకుండల కాంతులు గండయు
గంబునఁ గ్రేళ్ళుఱుక న్జడపై
మించిన మల్లెల మేలిమి తావులు
మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలు
వారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభానన
యేగెఁ గుమారుని యింటికి నై.