పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : మంగళమహాశ్రీ

14 మంగళమహాశ్రీ

చిత్తములఁ జూపులను జిత్తజునితండ్రి ప
యి జెంది గజదంతియతు లొందన్
వృత్తములతోడఁ దరుణీ మణులు గానరు
చులింపుగను మంగళమహాశ్రీ
వృత్తములఁ బాడిరి సువృత్త కుచకుంభము
ల వింత జిగి యెంతయుఁ దలిర్పన్
మత్తిలించు నబ్భజిసనంబు లిరుచోటులఁ
దనర్పఁగఁ దుదన్గగ మెలర్పన్.

గణ విభజన
UII IUI IIU III UII
చిత్తము లఁజూపు లనుజి త్తజుని తండ్రిప
IUI IIU III UU
గగ
యిజెంది గజదం తియతు లొందన్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 26
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, గగ
యతి : ప్రతిపాదంలోనూ 9వ, 17వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
చదువుకొనుటకు వీలుగా ఉంటుందని పాదాలను రెండుగా విడదీసాము గమనించండి
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6184మంగ.
ఈవిధమున న్విబుధు లేకతమ చిత్తము
ల నేకతము లేక హరి నీశు న్
భావమున నిల్పి తగు భాగవతయోగ ప
రిపాకమున నొందుదరు వారిం
దేవలదు దండనగతిం జనదు మాకు గు
ఱుతింప నఘము ల్దలఁగు మీఁదన్
శ్రీవరుని చక్రము విశేష గతిఁ గాచు సు
రసేవితులు ముక్తిఁ గడుఁ బెద్దల్.