పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : కవిరాజ విరాజితము

10 కవిరాజవిరాజితం

కమల దళంబుల కైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖ ప్రభలున్
సమధిక వృత్తకుచంబులు నొప్పగ శైలరసర్తు విశాల యతిన్
సముచితనాన్విత షడ్జలగంబు లజానుగఁ బాడిరి చక్రధరున్
రమణులు సొం పలరం గవిరాజ విరాజితమున్ బహు రాగములన్,

గణ విభజన
III IUI IUI IUI IUI IUI IUI IU
కమల దళంబు లకైవ డిఁజెన్న గుకన్ను లుజారు ముఖప్ర భలున్
(1'న', 6 'జ', 1 'వ' గణాలు)
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 23
ప్రతిపాదంలోని గణాలు: న, జ, జ, జ, జ , జ, జ, వ
యతి : ప్రతిపాదంలోనూ 8 వ, 14వ, 20వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య -3
ఉదాహరణ

భా10.2489కవి.
చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యు నగణ్యునిఁ జం
దన ఘనసార పటీర తుషార సుధా రుచికాయు విధేయు సుధా
శనరిపుఖండను సన్మణిమండను సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక యదుప్రభు ని ట్లని రుత్కలికన్.