పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : ఇంద్రవజ్రము

8 ఇంద్రవజ్రము

పదునొకండవ త్రిష్టుస్ఛంధంబునందుఇంద్రవజ్రయను వృత్తము
సామర్థలీలన్ తతజ ద్విగంబుల్
భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్.

గణ విభజన
UUI UUI IUI UU
గా
సామర్థ లీలన్త తజద్వి గంబుల్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 11
ప్రతిపాదంలోని గణాలు త, త, జ, గా
యతి ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 4

భా10.1690ఇ.
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే."