పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : గద్యము

30 గద్యము

క. కనుగొన బాదరహితమై

పనుపడి హరిగద్దె వోలె బహుముఖరచనం
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్.
గ గద్యము నకు - వచనము వలెనే ఛందోనియమము లేదు.
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య - 14
(ప్రతి స్కంధ అంతము నందు ఒక గద్యము చొప్పున ఉన్నాయి.)

ఉదాహరణ

12-54-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయణ నామధేయ ప్రణీతం బైన శ్రీ మహాభాగవతం బను మహా పురాణంబు నందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగ ధర్మ ప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయ విశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతి నొందుటయు, సర్పయాగంబును, వేదవిభాగ క్రమంబును, బురా ణానుక్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబును, సూర్యుండు ప్రతి మాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును, తత్త త్పురాణ గ్రంథ సంఖ్యలు నను కథలుగల ద్వాదశస్కంధము, శ్రీ మహాభాగవత గ్రంథము సమాప్తము.