పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : పృథు చక్రవర్తి చేసిన విష్ణు స్తుతి (సద్భక్తి ప్రదం)

  1
“వదా! యీశ్వర! నిను స
త్పురుషుఁడు దేహాభిమాన భోగములకు నై
మెట్లు గోరు నిహసుఖ
ములు నారకుల కైన ఱలవె చెపుమా.

  2
మగు దేవ! యీ వరమె కాదు మహాత్మక వాగ్వినిర్గతం
నఁదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై
రిన కీర్తియున్ విని ముదంబును బొందఁగ లేని మోక్ష మై
ను మదిఁ గోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!

  3
దిగాన పద్మలోచన!
మల భవదీయ ఘనయము వినుటకునై
దివేల చెవులు కృప ని
మ్మదియే నా యభిమతంబు గును ముకుందా!

  4
ఘ! మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సం
నిత సుధాకణానిలవశంబున విస్మృత తత్త్వ మార్గవ
ర్తను లగు దుష్టయోగులకుఁ గ్రమ్మఱఁ దత్త్వముఁ జూపఁజాలు ని
ట్లొరుట దక్క నన్య వర మొల్లఁ బయోరుహపత్రలోచనా!

  5
వినుత మంగళ యశోవిభవ! సర్వేశ్వర!-
యిందిర గుణసంగ్రహేచ్ఛఁ జేసి
యే నీదు శివతరం బై సత్కీర్తిని-
ర్థిమై వరియించె ట్టి కీర్తి
లిత సత్పురుష సంమము గల్గుచు నుండ-
ధృతినెవ్వఁడేని యాదృచ్ఛికతను
జేసియునొకమాటు చెవులార విన్నవాఁ-
నయంబును గుణజ్ఞుఁ య్యెనేని

  6
వితి నేరీతి బొందును ణిఁ బశువుఁ
క్కఁ దక్కిన తజ్ఞుండు నుజ భేది
గా యుత్సుకమతి నైన యేను లక్ష్మి
రణి నిన్ను భజింతు; నో! రమపురుష!

  7
ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయసేవం జేసి కలహంబు లేకుండని;మ్మట్లు గాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేనయేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము దేవా;” యని వెండియు నిట్లనియె.

  8
గదీశ! దేవ! యుష్మత్పద కైంకర్య-
రతఁ దనర్చు సారతనూజ
కృత్యంబునందు నకిల్బిష బుద్ధి నేఁ-
బ్రీతిఁ గోరుట జగన్మా యైన
యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ-
ల్గు నైనను దయాకార! నీవు
దీవత్సలుఁడవు గా స్వల్పం బైన-
ధికంబు చేయుదు! ట్లుగాన

  9
వ్యచరిత! నిజస్వరూపంబునందు
భిరతుఁడ వైన నీవు నన్నాదరించు
గిది నిందిర నాదరింవు మహాత్మ!
క్తజనలోక మందార! వవిదూర!

  10
ఇట్లగుటం జేసి సత్పురుషు లైనవారలు నిరస్తమాయాగుణ సముదయంబు గల నిన్ను భజియింతురు; వారలు భవత్పాదానుస్మరణ రూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు; దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు పలుకుదువు; యట్టి భవదీయ వాక్యతంత్రీనిబద్ధులు లోకులు గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతురు; యీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించు నట్లు మాకు నీవ హితాచరణం బాచరింప నర్హుండ"వని పలికిన నాదిరాజర్షి యైన పృథుచక్రవర్తి యర్థవంతంబు లయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె “మహారాజా! దైవప్రేరితుండవై నా యెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలం బగు భక్తి వొడము; దానిచే దుస్తరం బగు మదీయమాయం దరింతువు; నీవు నాచే నాదిష్టం బగు కృత్యం బప్రమత్తుండ వగుచు నాచరించిన సకల శుభంబులం బొందుదువు; మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గనరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు; గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ; మఱియు మదీ యాదేశంబున దుస్త్యజం బగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన యదియె నాకుఁ బరమహర్షదం బగు” నని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుం డయ్యె; నయ్యవసరంబున.

  11
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత పృథు చక్రవర్తి చేసిన విష్ణు స్తుతి (సద్భక్తి ప్రదం)