పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : *** భీష్మస్తుతి (భక్తి ప్రదం)

  1
"త్రిగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్ర సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
వియుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

  2
రింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై,
జాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో,
ముం బార్థున కిచ్చువేడ్క, నని నాస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

  3
రుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
రు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
భూపాయువు లెల్లఁ జూపులన శుంత్కేళి వంచించు నీ
మేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

  4
వారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

  5
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి-
గనభాగం బెల్లఁ ప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న-
గముల వ్రేఁగున గతి గదలఁ;
క్రంబుఁ జేపట్టి నుదెంచు రయమునఁ-
బైనున్న పచ్చనిటము జాఱ;
మ్మితి నాలావు గుఁబాటు సేయక-
న్నింపు మని క్రీడి రలఁ దిగువఁ;

  6
రికి లంఘించు సింహంబురణి మెఱసి
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున!" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

  7
కున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహార్మంబు వొమ్మంచు న
ర్జుసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
నులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

  8
లుకుల నగవుల నడపుల
లుకల నవలోకనముల నాభీరవధూ
కుముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.

  9
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.

  10
సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లి నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య దంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
కుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."

  11
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ప్రథమ స్కంధ అంతర్గత భీష్మస్తుతి (భక్తి ప్రదం)