పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : శివుఁడు గౌరితో సుఖముగా నుండుట.

  •  
  •  
  •  

3-197-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేలుపుఱేఁడు శంకరుఁడు విశ్వవిభుండు గురుండు కొండరా
చూలియుఁ దానుఁ గూడి బహుసుందరలీలల వెండికొండపై
సోలుచు నుండె లోకములు సుస్ధితిఁ బొందె ననేక కాలమున్
లాలితవృత్తితోడ నకలంకగతిన్ గడచెన్ ముదంబునన్.

టీకా:

వేలుపురేడు = దేవదేవుడు; అకలంకము = మచ్చలేనిది; సోలు = పరవశించు.

భావము:

దేవదేవుడు, జగదేకపతి, గురుడు యైన శంకరుడు పార్వతీదేవి తానూ కలసి చాలా ఆనందంగా వెండికొండపై పరవశిస్తూ యున్నారు. లోకాలన్నీ సుఖంగా యున్నాయి. ఏ ఆటంకమూ లేకుండా సంతోషంగా ఇలా చాలా కాలం గడచింది.

3-198-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని గౌరీదేవి వివాహోత్సవ క్రమంబు తెలియం జెప్పిన విని వాయుదేవునకు నమ్మహామును లిట్లనిరి.

టీకా:

క్రమము = విధము.

భావము:

అలా వాయుదేవుడు గౌరీ కళ్యాణం జరిగిన విధానం తెలియచేయగా విని, ఆ మహామునులు వాయుదేవునితో ఇలా అన్నారు.

3-199-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీగళుం డను నామము
ఫాలాక్షున కెట్లు వచ్చె ర్గుఁడు కడిమిన్
హాలాహలవిషవహ్నుల
నేలా భక్షించె మాకు నేర్పడఁ జెపుమా.

టీకా:

కడిమి = అతిశయము.

భావము:

“ఫాలాక్షునకు నీలకంఠుడనే పేరెలా వచ్చింది? శంకరుడు అతిశయమున హాలాహల విషాన్ని ఎలా మింగాడు? మాకు తెలియచేయుము” అని మునులు వాయుదేవుని అడిగారు.