పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

  •  
  •  
  •  

9-68-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోముతోడను వాసవుఁ
డేపున ముని పైని వజ్రమెత్తిన, మరలం
దాసుఁడు వజ్రిభుజమున,
నా వి నిలిపెన్ జగంబు లాశ్చర్యపడన్.

టీకా:

కోపము = కినుక; తోడను = తోటి; వాసవుడు = ఇంద్రుడు {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; ఏపునన్ = అతిశయించి; ముని = ఋషి; పైని = మీద; వజ్రమున్ = వజ్రాయుధమును; ఎత్తిన = సంధించగా; మరలన్ = తిరిగి; తాపసుండు = ఋషి; వజ్రి = ఇంద్రుని {వజ్రి - వజ్రాయుధముగలవాడు, ఇంద్రుడు}; భుజమునన్ = భుజముమీద; ఆ = ఆ; పవిన్ = వజ్రాయుధమును {పవి - ఎల్లపుడు చరించునది, కులిశము, వజ్రము}; నిలిపెన్ = స్తంభింపజేసెను; జగంబుల్ = లోకములు; ఆశ్చర్యపడన్ = చకితులగునట్లు.

భావము:

ఇంద్రుడు కినుకతో ఋషి మీద వజ్రాయుధాన్ని సంధించబోగా, తిరిగి ఋషి ఇంద్రుని భుజంమీద ఉన్న ఆ వజ్రాయుధాన్ని అక్కడే స్తంభించేలా చేసాడు. సకల లోకాలలోని జనులు చకితులు అయ్యారు.