పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

  •  
  •  
  •  

9-58-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నకంబగు ప్రాయంబున
రాండ్రఁ గరంచు మేని క్కఁదనంబున్
శితరముగఁ గృప జేయుఁడు
దివిజాధిప వైద్యులార! దీవింతు మిమున్."

టీకా:

నవకంబు = లేతది, కోమలము; అగు = ఐన; ప్రాయంబునన్ = వయసునందు; జవరాండ్రన్ = స్త్రీలను; కరంచు = వశీకరించుకొనగల; మేని = దేహపు; చక్కదనంబున్ = అందముతో; శివతరముగ = మంగళకరమగునట్లు; కృపజేయుడు = దయచేయండి; దివిజాధిప = దేవేంద్రుని; వైద్యులారా = వైద్యులు; దీవింతున్ = దీవించెదను; మిమున్ = మిమ్ములను.

భావము:

“దేవవైద్యులారా! మిమ్మల్ని దీవిస్తాను. నా దేహాన్ని తరుణ వయసు కలిగి, స్త్రీలను వశీకరించుకొనగల అందంతో మంగళకరం అయ్యేలా చేయండి.”