పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

  •  
  •  
  •  

9-52-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్యోతుల ముంటం బొడిచిన,
వాతుల నెత్తురులు గురిసె, సుధేశభట
వ్రాముల కెల్ల నచ్చట,
నా ఱి మలమూత్రబంధయ్యె; నరేంద్రా!

టీకా:

జ్యోతులన్ = వెలుగుతున్నవాటిని; ముంటన్ = ముల్లుతో; పొడిచినన్ = పొడవగా; వాతులన్ = నోటినుండి; నెత్తురులున్ = రక్తములు; కురిసెన్ = వర్షించెను; వసుధేశభట = రాజభటుల; వ్రాతముల్ = సమూహముల; కున్ = కి; ఎల్లన్ = అందరకు; అచటన్ = అక్కడ; ఆ = ఆ; తఱిన్ = సమయమునందు; మలమూత్ర = మలమూత్రములు; బంధము = స్తంభించిపోయినవి; అయ్యెన్ = అయినవి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}.

భావము:

రాజా! అలా వెలుగుతున్నవాటిని మిణుగురులు అనుకుని ముల్లుతో పొడవగా వాటినుండి రక్తాలు కారాయి. రాజభటులు అందరికి అక్కడ ఆ సమయంలో మలమూత్రాలు స్తంభించిపోయాయి.