పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శశిబిందుని చరిత్ర

  •  
  •  
  •  

9-713-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృశ లలితాకారలఁ
గిలయ కరతలల దేవకీముఖ్యల నా
బిరుహనయనల నందఱ
సుదేవుఁడు పెండ్లియాడె సుధాధీశా!

టీకా:

అసదృశ = సాటిలేని; లలిత = అందమైన; ఆకారలన్ = రూపములుగలవారు; కిసలయ = చిగురాకులవంటి; కరతలలన్ = అరచేతులుకలవారిని; దేవకీ = దేవకీ; ముఖ్యులన్ = మున్నగువారిని; ఆ = ఆ; బిసరుహ = తామరలవంటి; నయనలన్ = కళ్ళుకలవారిని; అందఱన్ = అందరిని; వసుదేవుడు = వసుదేవుడు; పెండ్లియాడె = వివాహముచేసుకొనెను; వసుధాధీశా = రాజా {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి అధీశుడు, రాజు}.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! సాటిలేని అందగత్తెలైన ఆ దేవకీ మున్నగు ఏడుగురు సోదరీమణులను వసుదేవుడు వివాహం చేసుకున్నాడు.