పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పాండవ కౌరవుల కథ

  •  
  •  
  •  

9-671-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ విచిత్రవీర్యునికిఁ గాశిరాజుకూఁతుల, నంబికాంబాలికల భీష్ముండు బలాత్కారంబున దెచ్చి వివాహంబు చేసిన విచిత్రవీర్యుండు వారలం దగిలి మనోజరాగమత్తుండై, చిరకాలంబు నానావిధక్రీడల విహరించుచు, రాజయక్ష్మ పీడితుండై, మృతుం డయ్యె; నంత.

టీకా:

ఆ = ఆ; విచిత్రవీర్యుని = విచిత్రవీర్యుని; కిన్ = కి; కాశిరాజు = కాశిరాజు; కూతులన్ = పుత్రికలను; అంబిక = అంబిక; అంబాలికలన్ = అంబాలికలను; భీష్ముండు = భీష్ముడు; బలాత్కారంబునన్ = బలవంతముగా; తెచ్చి = తీసుకొని వచ్చి; వివాహంబున్ = పెండ్లి; చేసినన్ = చేయగా; విచిత్రవీర్యుండు = విచిత్రవీర్యుడు; వారలన్ = వారిని; తగిలి = మరిగి; మనోజ = మదన; రాగ = భావములతో; మత్తుండు = మత్తెక్కినవాడు; ఐ = అయ్యి; చిరకాలంబున్ = చాలా రోజులు; నానావిధ = రకరకముల; క్రీడలన్ = క్రీడలతో; విహరించుచున్ = తిరుగుతు; రాజయక్ష్మ = క్షయరోగ; పీడితుండు = బాధితుడు; ఐ = అయ్యి; మృతుండు = మరణించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన = అంతట.

భావము:

ఆ విచిత్రవీర్యునికి కాశిరాజు పుత్రికలను అంబిక అంబాలికలను భీష్ముడు బలవంతంగా తీసుకొని వచ్చి పెండ్లి చేసాడు. విచిత్రవీర్యుడు వారిని మరిగి కామాకుల చిత్తుడు అయ్యాడు. చాలా కాలం వారితో రకరకాల క్రీడలతో తిరిగాడు. చివరికి క్షయరోగంతో మరణించాడు. అంతట.