పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-613-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూపాలక కన్యక వని
నీ యిఁ జిత్తంబు నాఁటె; నీవా రేరీ?
నీ పేరెవ్వరు? నిర్జన
భూర్యటనంబు దగవె? పూర్ణేందుముఖీ!"

టీకా:

భూపాలకకన్యకవి = రాకుమారివి; అని = అని; నీ = నీ; పయిన్ = మీద; చిత్తంబున్ = మనసు; నాటెన్ = లగ్నమైనది; నీ = నీకు; వారు = చెందినవారు; ఏరీ = ఎక్కడ ఉన్నారు; నీ = నీ యొక్క; పేరు = నామధేయము; ఎవ్వరు = ఏమిటి; నిర్జన = జనసంచారములేని; భూపర్యటనంబు = ప్రదేశమున తిరుగుట; తగవె = సరియైన పనా, కాదు; పూర్ణేందుముఖీ = సుందరీ {పూర్ణేందుముఖి - నిండు చంద్రునివంటి మోము కలామె, స్త్రీ}.

భావము:

“ఓ నిండుచంద్రుని వంటి మోము గల సుందరీ! నీవు రాకుమారివి అని నీ మీద నా మనసు లగ్నమైంది. జనసంచారం లేని చోట ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ నామధేయం ఏమిటి?”