నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము
- ఉపకరణాలు:
మృగయూథంబుల వెంటను
మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై
మృగయులు గొందఱు గొలువఁగ
మృగరాజపరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్.
టీకా:
మృగ = జంతువుల; యూథంబుల = సమూహముల; వెంటన్ = వెనుక; మృగలాంఛన = చంద్రునితో {మృగలాంఛనుడు - లేడి చిహ్నముగా కలవాడు, చంద్రుడు}; సన్నిభుండు = సమానుడు; మృగయా = వేట యందు; ఆతురుడు = తొందరకలవాడు; ఐ = అయ్యి; మృగయులు = వేటగాళ్ళు; కొందఱున్ = కొంతమంది; కొలువన్ = సేవించుతుండగా; మృగరాజ = సింహ; పరాక్రమంబున్ = పరాక్రమము; మెఱయగన్ = ప్రకాశించుచుండగా; వచ్చెన్ = చరించెను.
భావము:
దుష్యంత రాజచంద్రుడు వేట తమకంతో, వేటగాళ్ళు సేవిస్తుండగా, సింహ పరాక్రమం ప్రకాశిస్తుండగా జంతువుల వెంట పడి వేటాడసాగాడు.