పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

  •  
  •  
  •  

9-580-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంన హాటక పశు వే
దండాశ్వ వధూ దుకూల ధాన్యాదులు పె
క్కుండియు నాశాపాశము
ఖండింపఁగ లేవు మఱియుఁ డమయ చుమ్మీ.

టీకా:

మండన = నగలు; హాటక = బంగారము; పశు = పశుసంపద; వేదండ = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; వధూ = కన్యలు; దుకూల = మేలైన బట్టలు; ధాన్య = పంటసమృద్ధి; ఆదులు = మున్నగునవి; పెక్కు = ఎన్నో; ఉండియున్ = ఉన్నప్పటికి; ఆశా = తృష్ణ అనెడి; పాశమున్ = బంధమును; ఖండింపగన్ = తుంచివేయ; లేవు = సమర్థములు కావు; మఱియున్ = ఇంకను; కడమయ = కొరతగానే ఉండును; చుమ్మీ = సుమా.

భావము:

నగలు, బంగారం, పశుసంపద, ఏనుగులు, గుఱ్ఱాలు, కన్యలు, మేలైన బట్టలు, ఆస్తులు సర్వం ఎన్ని ఉన్నా ఆశాపాశం మాత్రం తెగదు. ఇంకా ఏదో కొరత ఉన్నట్లే అనిపిస్తుంది సుమా.