పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-510-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నయుఁ దండ్రియుం జన, యయాతి మహీపతి యై చతుర్దిశల్
న్నుగఁ గావఁ దమ్ములకుఁ బాలిడి శుక్రుని కూఁతురున్ సుసం
న్నగుణాభిరామ వృషర్వుని కూఁతురు నోలి నాండ్రుగా
న్నయశాలి యీ ధరణిక్రధురంధరుఁ డయ్యెఁ బేర్మితోన్."

టీకా:

అన్నయున్ = అన్న; తండ్రియున్ = తండ్రి; చనన్ = మరణించగా; యయాతి = యయాతి; మహీపతి = రాజు; ఐ = అయ్యి; చతుర్దిశల్ = నాలుగుదిక్కులు {చతుర్దిశలు - నల్దిక్కులు, 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; పన్నుగన్ = చక్కగా; కావన్ = పాలించుటకు; తమ్ముల్ = చిన్నసోదరుల; కున్ = కు; పాలిడి = పంచిపెట్టి; శుక్రుని = శుక్రుని యొక్క; కూతురున్ = కుమార్తెను; సుసంపన్న = మిక్కిలిసమృద్ధిగగల; గుణ = సుగుణములచే; అభిరామన్ = మనోజ్ఞమైనామె; వృషపర్వుని = వృషపర్వుని; కూతురున్ = కుమార్తెను; ఓలినాండ్రు = అరణము దాసి {అరణము - పెండ్లి యందు అల్లునికి ఆడబడచునకు యిచ్చు ధనము}; కాన్ = అగునట్లు; ఆ = ఆ; నయశాలి = నీతిమంతుడు; ఈ = ఈ; ధరణీచక్ర = భూమండలమును; ధురంధరుడు = పాలించువాడు {ధురంధరుడు - భారము మోయు వాడు, పరిపాలించువాడు}; అయ్యెన్ = అయ్యెను; పేర్మి = గౌరవము; తోన్ = తోటి.

భావము:

అన్న, తండ్రి రాజ్యం వదిలిపోగా యయాతి రాజు అయ్యాడు. తమ్ముళ్ళకు నాలుగుదిక్కులు పంచిపెట్టాడు. శుక్రుని కూతురుని భార్యగా వృషపర్వుని కూతురును అరణం దాసిగా చేపట్టి ఆ నీతిమంతుడు ఈ భూభారాన్ని వహించాడు.”