పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నహుషుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-509-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుషుఁడు మఖశతమును
మానుగఁ నొనరించి యింద్రమానిని గవయం
బూని మునీంద్రులు మోచిన
యాముపై నుండి కూలె హి యై నేలన్.

టీకా:

ఆ = ఆ; నహుషుడున్ = నహుషుడు; మఖ = యజ్ఞములను; శతమున్ = నూటిని; మానుగన్ = చక్కగా; ఒనరించి = చేసి; ఇంద్రమానినిన్ = శచీదేవిని {ఇంద్రమానిని - ఇంద్రుని భార్య, శచీదేవి}; గవయన్ = సురతమునకు; పూని = సిద్దపడి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; మోచిన = మోయుచున్న; యానమున్ = పల్లకి; పైన్ = మీద; నుండి = నుంచి; కూలెన్ = కూలిపోయెను; అహి = సర్పము; ఐ = అయ్యి; నేలన్ = నేలమీదకి.

భావము:

ఆ నహుషుడు వంద యజ్ఞాలు చక్కగా చేసి ఇంద్ర పదవి పొందాడు. శచీదేవిని పొందుకు పిలిచాడు. మునులు మోస్తున్న పల్లకి ఎక్కి నేల కూలి సర్పం అయ్యాడు.