పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-418-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంకొక యేఁడు పోయిన నరేశ్వర! యాతలిరేయి నీవు నా
లంకెకు వచ్చి యాత్మజుల క్షణవంతులఁ గాంచె దేమియుం
గొంక పొమ్ము నీ" వనుడుఁ గొమ్మను గర్భిణిఁగాఁ దలంచుచున్
శం యొకింతలేక నృపత్తముఁ డల్లన పోయె వీటికిన్.

టీకా:

ఇంకొక = మరొక; ఏడు = సంవత్సరము; పోయిన = జరిగిన; నరేశ్వర = రాజ {నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు}; ఆతలి = తరువాతి; రేయి = రాత్రి; నీవున్ = నీవు; నా = నా యొక్క; లంకె = సంగమమునకు; కున్ = కు; వచ్చి = వచ్చి; ఆత్మజుల = పుత్రులను {ఆత్మజులు – తనకు పుట్టిన వారు, పుత్రులు}; లక్షణవంతులన్ = గుణవంతులను; కాంచెదు = చూచెదవు; ఏమియున్ = ఏమాత్రము; కొంకక = సంకోచించకుండా; పొమ్ము = వెళ్లిపో; నీవు = నీవు; అనుడున్ = అనగా; కొమ్మనున్ = ఇంతిని; గర్భిణి = గర్భము ధరించినామె; కాన్ = అగునట్లు; తలంచుచున్ = ఊహించుకొని; శంక = అనుమానము; ఒకింతయున్ = కొంచము కూడ; లేక = లేకుండ; నృప = రాజులలో; సత్తముడు = శ్రేష్ఠుడు; అల్లన్ = మెల్లగ; పోయెన్ = వెళ్ళిపోయెను; వీటి = పురమున; కిన్ = కు.

భావము:

ఓ రాజ! ఇంకొక్క ఏడు పోయాక రాత్రి పూట నన్ను కలవడానికి రా. నీ కొడుకులను చూద్దువు గాని. ఇప్పటికి సందేహించకుండా వెళ్లిపో.” అని ఊర్వశి అనగా. ఇంతి గర్భం ధరించి ఉంటుంది అని ఊహించుకొని వెంటనే రాజశ్రేష్ఠుడు మెల్లగ తన పురానికి వెళ్ళిపోయాడు.