పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-400-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్క కాని చనఁబో
రొచోటన కాని నిలిచి యుండరు దమలో
నొటియ కాని తలంపరు
నొనిమిషముఁ బాయలేరు నువిదయు ఱేఁడున్.

టీకా:

ఒక = ఒకే; దిక్క = వైపుకు; కాని = తప్పించి; చనబోరు = వెళ్ళరు; ఒక = ఒకే; చోటనన్ = ప్రదేశములో; కాని = తప్పించి; నిలిచి = ఆగి; ఉండరు = ఉండరు; తమలోన్ = వారిలోవారు; ఒకటియ = ఒకటే; కాని = తప్పించి; తలంపరు = అనుకొనరు; ఒక = ఒకటైనా; నిమిషమున్ = నిమిషముపాటు; పాయలేరు = విడిచివుండలేరు; ఉవిదయన్ = రమణి; ఱేడున్ = రాజు.

భావము:

రాజు పురూరవుడు రమణి ఊర్వశి ఇద్ధరూ ఒకే దిక్కుకు వెళ్ళేవారు. ఒకే చోట ఉండే వారు. వారిలోవారు ఒకేలా తలచేవారు. ఒక్క క్షణమైనా విడిచి ఉండేవారు కాదు.