పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-398-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజు రాజముఖిని తిఁదేల్చె బంగారు
మేడలందుఁ దరుల నీడలందుఁ
దోఁటలందు రత్నకూటంబులందును
గొలఁకులందు గిరులకెలఁకులందు.

టీకా:

రాజు = రాజు; రాజముఖిని = అందగత్తెను {రాజముఖి - రాజ (చంద్రుని)వంటి ముఖి, వనిత}; రతిన్ = సురత సుఖములలో; తేల్చెన్ = ఓలలాడించెను; బంగారు = బంగారపు; మేడలు = భవనముల; అందున్ = లోను; తరుల = చెట్ల; నీడలు = ఛాయలు; అందున్ = లోను; తోటలు = ఉద్యానవనములు; అందున్ = లోను; రత్న = రత్నాల; కూటంబులు = చావళ్ళు; అందునున్ = లోను; కొలంకుల్ = సరోవరములు; అందున్ = లోను; గిరుల = కొండ; కెలకులు = పక్కలు; అందు = లోను.

భావము:

పురూరవుడు ఆ అందగత్తెను బంగారు భవనాలలో, చెట్లనీడలలో, ఉద్యానవనాలలో, రత్నాల చావళ్ళలో, గిరి శిఖరాలలో, సరస్సులలో; సరసాలతో సురతసుఖాలలో ముంచి తేల్చాడు.