పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బుధుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-384-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చెలువా! నీ యెలసిగ్గు వాసి, గురుఁడో శీతాంశుఁడో యెవ్వడీ
లితాకారుఁ గుమారుఁ గన్న యతఁ? డేలా దాఁప? నీపాటు నీ
నేపుట్టెనె? వెచ్చనూర్పకుము? కాంతల్ గాముకల్ గారె? మా
నిందేమియుఁ బోదు పో యొరులతోడంజెప్ప; విన్పింపవే."

టీకా:

చెలువా = సుందరి; నీ = నీయొక్క; ఎలసిగ్గు = చిరుసిగ్గును; వాసి = వదలివేసి; గురుడో = బృహస్పతా; శీతకరుడో = చంద్రుడా; ఎవ్వడు = ఎవరు; ఈ = ఈ; లలిత = సుందరమైన; ఆకారున్ = ఆకారము గలిగిన; కుమారున్ = పుత్రుని; కన్న = పుట్టించిన; అతడు = వాడు; ఏలన్ = ఎందుకు; దాపన్ = దాచుకొనుట; నీ = నీయొక్క; పాటు = దుస్తితి; నీ = నీ; తలనేపుట్టెనె = మొదలైందా, కాదు; వెచ్చనూర్చకుము = నిట్టూర్చకు; కాంతల్ = వనితలు; కాముకుల్ = కాముకులు; కారె = కారా, అవును; మాటలన్ = నోటితోచెబితే; ఇందు = ఇక్కడ; ఏమియుబోదుపో = ఏమవదులే; ఒరుల్ = ఇతరుల; తోడన్ = తోటి; చెప్పన్ = చెప్పను; విన్పింపవే = చెప్పుము.

భావము:

“సుందరీ! ఈ ముద్దొస్తున్న కొడుకును కన్నావు. నీవు సిగ్గుపడడం మానేసి కన్నతండ్రి బృహస్పతా చంద్రుడా ఎవరు చెప్పు. ఎందుకు దాస్తావు. ఈ బుద్ధి నీతోనే మొదలు కాలేదు కదా. కాంతలు కాముకులు కారా ఏమిటి. ఇంక నిట్టూర్చకు, నోరు విప్పి చెప్తే ఏమవదులే. ఎవరికి చెప్పనులే. చెప్పు చెప్పు.”