పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బుధుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-382-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇలువరుస చెడఁగ బంధులు
వంపఁగ మగఁడు రోయఁ ల్లీ! కట్టా!
వెలినేల నన్నుఁ గంటివి
లిగించినవాఁడు శీతరుఁడో? గురుఁడో?"

టీకా:

ఇలువరుస = ఇంటి మర్యాద, వంశ పరువు; చెడగన్ = పోవునట్లుగ; బంధులు = బంధువులు; తలవంపగన్ = అవమానపడునట్లు; మగడు = భర్త; రోయన్ = అసహ్యించుకొన్నట్లు; తల్లీ = అమ్మా; కట్టా = అయ్యో; వెలిన్ = బయట తిరిగి; ఏలన్ = ఎందుకు; నన్నున్ = నన్ను; కంటివి = కన్నావు; కలిగించినవాడు = పుట్టించినవాడు; శీతకరుడో = చంద్రుడా {శీతకరుడు - చల్లని కిరణములవాడు, చంద్రుడ}; గురుడో = బృహస్పతా.

భావము:

అమ్మా! ఇంటి మర్యాద, వంశ పరువు పోయేలా, బంధువులంతా అవమానపడేలా, భర్త అసహ్యించుకొనేలా, అయ్యో! నన్ను ఇతరులకు ఎందుకు కన్నావు. నన్ను పుట్టించినవాడు చంద్రుడా? బృహస్పతా? చెప్పు.”