పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బుధుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-380-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారివాదు చూచి వారింపఁగా వచ్చి
యేర్పరింప లేక యెల్ల మునులు
మరవరుల నడుగ "నా వేడుకలకత్తె
యెఱుఁగుఁ గాని యితరు లెఱుఁగ" రనిరి.

టీకా:

వారి = వారి యొక్క; వాదున్ = వాదించుకొనుట; చూచి = చూసి; వారింపగన్ = తగవు తీర్చుటకు; వచ్చి = వచ్చి; ఏర్పరింపలేక = నిర్ణయించ లేక; ఎల్ల = అందరు; మునులు = మునులు; అమర = దేవతా; వరలన్ = శ్రేష్ఠులను; అడుగన్ = విచారించగా; ఆ = ఆ; వేడుకలకత్తె = వగలాడికే; ఎఱుగున్ = తెలియును; కాని = తప్పించి; ఇతరులు = ఇంకెవరును; ఎఱుగరు = తెలియలేరు; అనిరి = అని చెప్పిరి.

భావము:

దేవతలు ఎందరో వచ్చినా వారి తగవు తీర్చలేక పోయారు. ఎవరి బిడ్డో తేల్చలేకపోయారు. చివరికి “నిజం ఏమిటో ఆ వగలాడికే తెలియాలి తప్పించి ఇంకెవరికి తెలియదు.” అని అన్నారు.