పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

  •  
  •  
  •  

9-357-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే
నాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే
తుది చేయం దగ" దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా
గాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?

టీకా:

ముదితా = ఓ కాంతా; ఏటికిన్ = ఎందుకు; క్రుంకితి = కుంగిపోయితివి; ఈవు = నీవు; మన = మనమధ్య; లోన్ = అందు; మోహంబున్ = ప్రీతి; చింతింపవే = ఆలోచింపుము; వదన = మోము అనెడి; అంభోజమున్ = పద్మమును; చూపవే = చూపుము; మృదువు = మృదువైనవి; నీ = నీయొక్క; వాక్యంబున్ = మాటలు; విన్పింపవే = వినిపించుము; తుదిన్ = విడిపోవుట; చేయన్ = చేయుటకు; తగదు = తగినది; అంచున్ = అనుచు; ఈశ్వరుండును = భగవంతుడును; ఐ = అయ్యి; దుఃఖించె = శోకించెను; భూపాలుడు = మహారాజు; ఆపద = ఆపదే; కాదే = కాదా, అవును; ప్రియురాలిన్ = ప్రియురాలిని; పాసిన = దూరమైన; తఱిన్ = వేళ; భావింపన్ = తరచిచూసినచో; ఎవ్వారికిన్ = ఎలాంటివారికైనను.

భావము:

తాను భగవంతుడే అయినా రాముడు సీత కోసం దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. “ఓ కాంతా! అయ్యో నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు. మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు. నీ మృదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు.” అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగుతుంది కదా..