పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

  •  
  •  
  •  

9-351-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా
నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్
బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్
దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.

టీకా:

వట్టి = పసిమిచెడిన, ఎండిపోయిన; మ్రాకులు = మోళ్ళు; పల్లవింపన్ = చిగురించగా; అవారి = అపరిమితమైనది; ఐ = అయ్యి; మధు = అమృత; ధార = ధారలు; తాను = తమంత తాము; ఉట్టన్ = ఒలికేటట్టులుగా; పాడినన్ = పాడగా; వారి = వారియొక్క; పాట = పాట; కున్ = కు; ఉర్వరాధిపుడున్ = మహారాజు {ఉర్వరాధిపుడు - ఉర్వర (భూమికి) వర (శ్రేష్ఠమైన) అధిపుడు (ప్రభువు), రాజు}; ప్రజలున్ = ప్రజలు; బిట్టు = మిక్కిలి, గట్టిగా; సంతసమున్ = సంతోషమును; అందిరి = పొందిరి; అయ్యెడ = అప్పుడు; ప్రీతిన్ = ప్రేమతో; కన్నులన = కన్నులమ్మట; భాష్పముల్ = కన్నీరు; తొట్టన్ = తొణికిసలాడగ; ఔదలల్ = తలలను; ఊచి = ఊపి; వారల = వారి; తోడి = తోటి; మక్కువలు = కూరిమి; పుట్టగాన్ = కలుగగా.

భావము:

ఆ విధంగా శ్రీరాముని యాగసాలలో ఎండిన మోళ్ళు చిగురించేలా, అమృత ధారలు జాలువారేలా పాడారు. వారి పాటను మహారాజు, ప్రజలు అందరూ తలలూపుతూ, ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు, వారిపై ఎక్కువ మక్కువ కలిగింది.