పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

  •  
  •  
  •  

9-349-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధువనంబులోన ధునందనుం డగు
వణుఁ జంపి భుజబలంబు మెఱసి
ధుపురంబు చేసె ధుభాషి శత్రుఘ్నుఁ
న్న రామచంద్రుఁ డౌ ననంగ.

టీకా:

మధువనంబులోనన్ = మధువనమునందు; మధు = మధువు అనెడి రాక్షసుని; నందనుండు = పుత్రుడు; అగు = ఐన; లవణున్ = లవణుని; చంపి = సంహరించి; భుజబలంబున్ = బాహుబలము; మెఱసి = ప్రకాశింపజేసి; మధుపురంబున్ = మధుపురమును; చేసె = నిర్మించెను; మధు = మధురముగ; భాషి = మాట్లాడువాడు; శత్రుఘ్నుడు = శత్రుఘ్నుడు; అన్న = సోదరుడు; రామచంద్రుడు = శ్రీరాముడు; ఔననగన్ = మెచ్చుకొనగా.

భావము:

మథురభాషి శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చేలా, మధురాసురుని కొడుకు లవణుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు.