పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : గంగాప్రవాహ వర్ణన

  •  
  •  
  •  

9-233-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిఁ దమ మనముల లోనిడి
రి పాదాంభోజ జనితమైన నదిన్ సు
స్థిరులై క్రుంకి మునీంద్రులు
రిఁ గలిసిరి త్రిగుణరహితులై యవ్వేళన్.

టీకా:

హరిన్ = విష్ణుని; తమ = తమయొక్క; మనముల = మనసులు; లోన్ = అందు; ఇడి = నిలుపుకుని; హరి = విష్ణుమూర్తి; పాద = పాదములనెడి; అంభోజ = పద్మములందు; జనితము = పుట్టినది; ఐన = అయిన; నదిన్ = నదిని; సుస్థిరులు = నిశ్చలమానసులు; ఐ = అయ్యి; క్రుంకి = స్నానములుచేసి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; హరిన్ = విష్ణునియందు; కలిసిరి = ఐక్యమయ్యారు; త్రిగుణరహితులు = త్రిగుణాతీతులు, ముక్తులు; ఐ = అయ్యి; అవ్వేళన్ = అప్పుడు.

భావము:

అప్పుడు విష్ణుమూర్తిన ధ్యానిస్తూ నిశ్చలమానసులై అయ్యి, త్రిగుణాతీతులై, విష్ణుపాదపద్మాల పుట్టిన ఆ గంగానదిలో స్నానాలు చేసి, మునివరులు ముక్తులై శ్రీహరిలో ఐక్యమయ్యారు.