పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : గంగాప్రవాహ వర్ణన

  •  
  •  
  •  

9-231-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ వడిన్ దాఁటి త
త్సరక్ష్మాపకుమార భస్మముల మీఁదన్ ముంచి పాఱన్ మరు
న్నరావాసము వారు పొందిరి నవీశ్రీలతో గంగ నీ
రుతిం గాక మహాదురంత సుజనద్రోహానలం బాఱునే.

టీకా:

జగతీనాథు = రాజుయొక్క; రథంబు = రథము; పజ్జన్ = వెనుక; బహు = అనేకమైన; దేశంబుల్ = ప్రదేశములను; వడిన్ = వేగముగా; దాటి = గడచి; తత్ = ఆ; సగర = సగరుడు అనెడి; క్ష్మాపకుమార = రాకుమారుల {క్ష్మాపకుమారులు - క్షమ ప (భూమినేలేడివాని) కుమారులు, రాకుమారులు}; భస్మముల = బూడిదల; మీదన్ = పైన; ముంచి = మీంచి; పాఱన్ = ప్రవహించగా; మరున్నగర = స్వర్గమునందు {మరున్నగరము - మరుత్ (దేవతల) నగరము, స్వర్గము}; ఆవాసము = నివసించుటను; వారు = వారు; పొందిరి = పొందిరి; నవీన = సరికొత్త; శ్రీలు = శుభములు; తోన్ = తోటి; గంగ = గంగాజలము; గతిన్ = వలన; కాక = తప్పించి; మహా = గొప్ప; దురంత = దాటరాని; సుజన = పుణ్యాత్ములపట్ల; ద్రోహ = చేసినతప్పు అనెడి; అనలంబు = నిప్పు; ఆఱునే = చల్లారుతుందా, చల్లారదు.

భావము:

ఆ విధంగా భగీరథ మహారాజు రథం వెంట ఎంతో వేగంగా సాగుతూ, అనేక ప్రదేశాలను దాటి ఆ సగరచక్రవర్తి కుమారుల బూడిద రాసుల మీంచి ప్రవహించింది. వారు అభినవ శోభలతో స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ములపట్ల చేసిన దోషాగ్ని గంగాజలం వలన తప్పించి మరే విధంగాను చల్లారదు కదా.